18 July, 2026 | 1:06 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

ధాన్యం కొనుగోలుపై కేంద్రం నిర్లక్ష్యం

29-05-2026 01:15 PM

బిజెపి నాయకులు కొనుగోలు కేంద్రాల వద్ద డ్రామాలు చేస్తున్నారు

ఆదివాసి కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్

ఖానాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పై కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని, దాన్ని అలుసుగా తీసుకుని రాష్ట్రంలో బిజెపి నాయకులు కొనుగోలు కేంద్రాల వద్ద డ్రామాలు చేస్తూ రైతులను అయోమయానికి గురి చేస్తున్నారని ఆదివాసీ కాంగ్రెస్ నిర్మల్ జిల్లా చైర్మన్ బాణావత్ గోవింద నాయక్ విమర్శించారు. ఆయన విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం స్పందించకుండా తెలంగాణ బిజెపి మాత్రం కొనుగోలు కేంద్రాల వద్ద డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ రైతుల ధాన్యం కొనుగోలు పై కేంద్రాన్ని ఒప్పించడంలో పూర్తిగా విఫలమైనారని విమర్శించారు. సమావేశంలో ఆదివాసి కాంగ్రెస్ నాయకులు ఆత్రం రాజేశ్వర్, వసంతరావు, వెడ్మ శేఖర్ తదితరులు ఉన్నారు.