calender_icon.png 13 June, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులందరికీ సదరం సర్టిఫికెట్లు: మంత్రి సీతక్క

11-06-2025 12:00:00 AM

హైదరాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): సదరం సర్టిఫికెట్ల జారీ లో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి సీతక్క విమర్శించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సదరం సర్టిఫికెట్లు జారీ చేయాలని వైద్యులను ఆమె ఆదేశించారు. మంగళవారం బేగంపేటలోని టూరిజం ప్లాజా లో వైద్యులకు ఏర్పాటు చేసిన వర్క్‌షాపులో ఆమె మాట్లాడారు. రాష్ర్టవ్యాప్తంగా 38 ఆస్పత్రుల్లో సదరం సర్టిఫికెట్ల జారీ కోసం అంగవైకల్య పరీక్షలు నిర్వహిస్తున్నామని,

ఒక్కో ఆస్పత్రికి పది లక్షల చొప్పు న మొత్తం రూ.3.8 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. 21 రకాల వైకల్యాలను గుర్తించి సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ ఓరియంటేషన్ కార్యక్రమానికి రెండు వందలకుపైగా వైద్యులు హాజరయ్యారు.