17 April, 2026 | 11:03 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

జీహెచ్‌ఎంసీలో తిష్టవేసిన పలువురు అక్రమాలకు పాల్పడుతున్న చైన్‌మెన్లు

09-04-2025 12:14 AM
  1. దళిత చైతన్య సంఘం అధ్యక్షుడు ముప్పిడి నవీన్‌కుమార్

  2. హైదరాబాద్  సిటీబ్యూరో, ఏప్రిల్ 8(విజయక్రాంతి) : జీహెచ్‌ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్లలో పలువురు చైన్‌మెన్లు తిష్టవేసి అక్రమాలకు పాల్పడుతున్నారని దళిత చైతన్య సంఘం (డీసీఎస్) అధ్యక్షుడు ముప్పిడి నవీన్‌కుమార్ ఆరోపించారు.

  3. వారిపై పూర్తి ఆధారాలతో ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో 40, 50గజాల్లో 4, 5 అంతస్తుల భవనాలను కడుతున్నప్పటికీ జీహెచ్‌ఎంసీ అధికారులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. 

  4. వారి నుంచి చైన్‌మెన్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, పలువురు విధులకు హాజరు కాకుండా జీతాలు పొందుతున్నారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్యకార్మికులకు ఎఫ్‌ఆర్‌ఎస్ హాజరు పెట్టిన అధికారులు వీరికి ఎందుకు ఎఫ్‌ఆర్‌ఎస్ పెట్టడంలేదని ప్రశ్నించారు. సమావేశంలో దళిత చైతన్య సంఘం నాయకులు మధుసూధన్, శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.