09-04-2025 12:16:25 AM
ఆదిలాబాద్, ఏప్రిల్ 8 (విజయ క్రాంతి) : బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈనెల 27న వరంగల్ లో జరిగే రాజతోత్సవ సభకు పెద్దఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించిన బోథ్ పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. వరంగల్ సభకు నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి మన సత్తా చాటాలని పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో మళ్ళీ ఏ ఎన్నిక జరిగిన గులాబీ జెండా ఎగురాలని ఆకాంక్షించారు.