11-10-2025 06:31:26 PM
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి మాదిగ
కాటారం (విజయక్రాంతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ పై దాడి చేసిన లాయర్ పై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని కాటారం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు మంతెన చిరంజీవి మాదిగ కోరారు. చీఫ్ జస్టిస్ పై దాడి జరగడం దారుణమని, దాన్ని ఖండిస్తూ ఈ నెల 13న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద చలో కలెక్టరేట్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని దళిత సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జస్టిస్ గవాయ్ పై దాడియత్నం కేసు నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు.