08-05-2025 12:00:00 AM
భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం మే 7 (విజయ క్రాంతి): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టిఐ కన్వీనర్ గా ఖమ్మం బార్ అసోసియేషన్ కు చెందిన కోన చంద్రశేఖర్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు లీగల్ సెల్ రాష్ట్ర చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. కోన చం ద్రశేఖర్ గుప్తా గతంలో ఖమ్మం జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
తన నియామకానికి సహకరించిన తె లంగాణ ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క , మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొం గులేటి శ్రీనివాస్ రెడ్డి,పొన్నం ప్రభాకర్, ఖ మ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామరెడ్డి, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జిల్లా అ ధ్యక్షులు పువ్వాళ్ళ దుర్గ ప్రసాద్, సీనియర్ న్యాయవాదులు స్వామి రమేష్ కుమార్, దండా సుధాకర్, లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ జనార్ధన్కు, కృతజ్ఞతలు తెలియజేశారు.