షూటింగ్ షెడ్యూల్స్లో మార్పులు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘స్పిరిట్’ ఒకటి. సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఇందులో ప్రభాస్ జోడీగా ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి డిమ్రి కథానాయికగా నటిస్తుండగా, వివేక్ ఒబేరాయ్, ప్రకాశ్రాజ్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపిస్తారు. 2027, మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభించుకుంది.
మొదటి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లో పూర్తయింది. ఇక ఈ మూవీకి సంబంధించి కీలక షెడ్యూల్ ఈ నెలలోనే జరగాల్సి ఉంది. అయితే, తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ షెడ్యూల్ మే నెలకు మారింది. ఈ గ్యాప్లో ప్రభాస్ యూరప్లో విహారయాత్ర కోసం వెళ్లారని తెలుస్తోంది.
ఈ తాజా పరిణామాల నేపథ్యంలో వచ్చే నెలలో దర్శకుడు నాగ్అశ్విన్ ప్లాన్ చేసిన ‘కల్కి2898ఏడీ’ సీక్వెల్ షూటింగ్ షెడ్యూల్లోనూ చిన్నపాటి మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు సినిమాల షెడ్యూల్స్కు అనుగుణంగా మేకర్స్ షూటింగ్ ప్లానింగ్ను సర్దుబాటు చేస్తున్నారు.






