14-02-2026 01:08:38 AM
గరిడేపల్లి, ఫిబ్రవరి 13: మండలంలోని పొనుగోడు గ్రామంలో గల సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయానికి దాతలు లక్ష రూపాయల విలువగల రథాన్ని శుక్రవారం అందించారు. పొనుగోడు గ్రామానికి చెందిన ఏడిపాల రాములమ్మ జ్ఞాపకార్థం ఆమె భర్త లింగారెడ్డి, కుమారుడు ఎడిపాల సత్యనారాయణ రెడ్డి, ధర్మపత్ని నాగమణి, మనుమడు పవన్ కుమార్ రెడ్డిలు రథాన్ని దేవాలయానికి బహూకరించారు. పొనుగోడు గ్రామంలో ప్రతి ఏడాది వేణుగోపాల స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కళ్యాణం అనంతరం స్వామివారిని ఊరేగించేందుకు ఈ రథాన్ని ఉపయోగించుకునే అవకాశం కలిగింది. వేణుగోపాల స్వామి ఆలయానికి లక్ష రూపాయలతో రథాన్ని బహుకరించడం పట్ల గ్రామస్తులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు.