04-06-2025 07:46:10 PM
సంస్థాన్ నారాయణపూర్ (విజయక్రాంతి): నారాయణపూర్ మండలం అల్లందేవి చెరువు గ్రామపంచాయతీకి చెందిన గుండు పాండుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన 60 వేల రూపాయల చెక్కును బుధవారం సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్(Sarpanch Association State President Survi Yadaiah Goud) అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు మంజూరుకు సహకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్(BRS Working President KTR), శాసన మండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ మధుసూధనాచారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ తిరుపతయ్య గౌడ్, బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు ఏర్పుల రమేష్, గ్రామపంచాయతీ మాజీ కోఆప్షన్ డైరెక్టర్ సుర్వి శంకరయ్య, బిఆర్ఎస్వి నాయకులు వినోద్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, విజయ్, ఈదులకంటి రవి గౌడ్, సుర్వి వెంకటేష్ గౌడ్, గుండు జంగయ్య గౌడ్, యాదయ్య, వీరమల్ల నరసింహ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.