calender_icon.png 6 June, 2025 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూకబ్జాదారులను కఠినంగా శిక్షించాలి

04-06-2025 07:53:52 PM

ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్..

హనుమకొండ (విజయక్రాంతి): మండలంలోని నాగయ్య పల్లెలో కొంతమంది అగ్రకుల రెడ్డి కులస్తులు భూకబ్జాదారులుగా అవతారమెత్తి రెచ్చిపోయారు. ఏకంగా ఎస్సీల స్మశానవాటికనే కబ్జా చేశారు. సర్వే నెంబర్ 931లో దాదాపు రెండు ఎకరాల భూమిలో ఆది నుంచి గ్రామంలోని మాదిగ కులస్తులు స్మశానవాటికగా ఏర్పాటు చేసుకొని సమాధులు నిర్మించారు. ఈ భూమిపై కన్నేసిన గ్రామానికి చెందిన పోగుల మహేందర్ రెడ్డి, పోగుల బ్రహ్మయ్య, పోగుల కైలాసం, పోగుల సురేందర్ అను వ్యక్తులు మంగళవారం గుర్తుతెలియని రెండు జెసిబిలను తీసుకువచ్చి సమాధులను తొలగించి స్మశానవాటికలోకి అక్రమంగా ప్రవేశించి భూమిని చదును చేశారు.

దీనిపై పోలీసు అధికారులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రజాసంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ ఆధ్వర్యంలో గ్రామస్తులు బుధవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాతో సుమారు రెండు కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ కఠిన చర్యలు తీసుకొని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్సై తిరుపతి సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళనకాలను శాంతింపజేసి కబ్జాదాలపై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చి ధర్నాను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో వివిధ దళిత ప్రజాసంఘాల నాయకులు బాగాజీ రజనీకాంత్, జినుక అశోక్, మాదాసి ప్రభాకర్, మాదాసి ఎర్ర సూరయ్య, మాదాసి కృష్ణ, మాదాసి సాంబయ్య, మాదాసి సుధాకర్, సంగి యాకయ్య, గిన్నారపు భాస్కర్, మాదాసిరాజు, మాదాసి మల్లయ్య, మాదాసి రాహుల్ తదితరులు పాల్గోన్నారు.