12 June, 2026 | 2:10 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం

15-10-2025 09:15 PM

పరమేశ్వర్ రెడ్డి..

ఉప్పల్ (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరం లాంటిదని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి అన్నారు. మల్లాపూర్ కు చెందిన  ఎండి మిస్బా ఇటీవల కాలంలో అనారోగ్యంతో బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని నాచారం సీనియర్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్ విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు పరమేశ్వర్ రెడ్డి  ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలను మంజూర అయ్యే విధంగా చొరవ తీసుకొని వారి యొక్క కుటుంబ సభ్యులకు ఎల్ఓసి పత్రం చేశారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.