26-12-2025 12:00:00 AM
గోపాల్పేట గ్రామ క్రిస్మస్ వేడుకల్లో ఆర్డీఓ పార్థసింహారెడ్డి
నాగిరెడ్డిపేట్, డిసెంబర్ 25 (విజయ క్రాంతి): నాగిరెడ్డిపేట్ మండలంలో క్రిస్మస్ సెలబ్రేషన్ పర్వదినాన పండగ వేడుకలు అంబరాన్ని అంటాయి. ఆనందోత్సవాల మధ్య క్రిస్మస్ వేడుకలు అట్టాసంగా జరిగాయి. క్రైస్తవ సోదరులు భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. వెలుగులు విరజిమ్మి కొవ్వొత్తుల కాంతులు, క్రిస్మస్ చెట్లు,బాల యేసు జన్మనృత్యాన్ని తెలిపేలా అలంకరించిన పాకలు.సర్వంగ సుందరంగా ముస్తాబైన చర్చిలు క్రైస్తవ సోదర సోదరులతో కిటకిటలాడాయి.
ఏసుప్రభు జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం మండలంలోని గ్రామాలలో క్రైస్తవ సోదర, సోదరీమణులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఏసుప్రభు నామస్మరణలతో క్రైస్తవ దేవాలయాలు మారుమోగాయి. గోపాల్పేట్ గ్రామంలో క్రిస్మస్ ఫెస్టివల్ ప్రోగ్రాంలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. మండలంలోని ఆయా గ్రామాల్లో గల చర్చిల్లో పాస్టర్లు దైవ సందేశాన్ని అందించారు. యేసుప్రభు జనన రహస్యాన్ని అందరూ ప్రేమ పూర్వంగా ఒకరినొకరు సోదర భావంతో మెలగాలని పిలుపునిచ్చారు.
ఏసుప్రభు దీవెనలు అందరికీ ఉండాలని తెలిపారు.ఎల్లారెడ్డి ఆర్డీవో గోపాల్పేట్ గ్రామంలో చర్చి వేడుకల్లో పార్థసింహారెడ్డి మాట్లాడుతూ..క్రిస్మస్ పండగ ప్రేమ, శాంతి సౌబ్రాతృత్వాన్నికి ప్రతిక అని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఐక్యతతో కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గోపాల్పేట గ్రామంలో గల క్రిస్మస్ వేడుకల్లో గ్రామ నూతన సర్పంచి వంశీకృష్ణ గౌడ్ పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్లో..
నిజామాబాద్, డిసెంబర్ 25 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోనీ మోపాల్, జక్రంపల్లి, దిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి,సిరికొండ మండలంలో గురువారం క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించారు. మండలల లోని పలు గ్రామాల్లో ఉన్న చర్చిలు విద్యుత్ దీపాల అలంకరణలతో సుందరంగా మెరిశాయి. ఉదయం నుంచే క్రైస్తవులు పెద్ద సంఖ్యలో చర్చిలకు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనల్లో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని బైబిల్ పఠనం, భక్తిగీతాలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చర్చిల వద్ద కేక్ కటింగ్ కార్యక్రమాలు ఏర్పాటు చేసి పరస్పరం క్రిస్మస్ శుభాకాం క్షలు తెలుపుకున్నారు. పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులు అందజేశా రు. గ్రామాల్లో ఆనందోత్సాహాల మధ్య క్రిస్మస్ వేడుకలు కొనసాగాయి. పండుగ సందర్భంగా ఇళ్లలో ప్రత్యేక వంటకాలు సిద్ధం చేసి బంధువులు, స్నేహితులతో పంచుకున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, సోదరభావాన్ని పెంపొందించేదిగా ఉందని వారు పేర్కొన్నారు.
యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, క్షమాగుణం, సేవాభావాన్ని ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఆచరించాలని సందేశమిచ్చారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సిరికొండ మండలంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేయడంతో వేడుకలు సాఫీగా సాగాయి. మొత్తం మీద సిరికొండ మండలం లో క్రిస్మస్ పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించారు.