16-06-2025 04:46:36 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): గుండెపోటుతో ఇంటి పెద్ద మరణించడంతో నిరుపేద కుటుంబానికి 30 వేల రూపాయలను అందించి అండగా నిలిచిన ఘటన మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) కేసముద్రంలో సోమవారం జరిగింది. గుండెబోయిన నాగరాజ్ ఇటీవల గుండెపోటుతో మరణించగా ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను గమనించిన రాధాకృష్ణ యాదవ సంఘం సభ్యులు 30 వేల రూపాయలను నాగరాజు భార్య హేమ, కుమారులు రిశాంక్, కృశాంక్ ఆదివారం అందజేసి అండగా నిలిచారు.