16 April, 2026 | 12:05 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

నగరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత.. సివిల్ కాంట్రాక్టర్‌ అరెస్టు

02-11-2025 04:17 PM

హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (HNEW) ఆదివారం డ్రగ్స్ అమ్ముతున్న ఓ సివిల్ కాంట్రాక్టర్‌ను అరెస్టు చేసింది. అతని నుండి 11 గ్రాముల ఎండీఎఏ, 35 గ్రాముల కొకైన్, 5 గ్రాముల ఓజీ ఖుష్ గంజాయి, 15 ఎక్స్టసీ మాత్రలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఎజిజ్ అహ్మద్ (28) అనే వ్యక్తి బెంగళూరులోని ఒక నైజీరియన్ జాతీయుడి నుండి డ్రగ్స్ కొనుగోలు చేసి, ఇక్కడి వినియోగదారులకు విక్రయించడానికి హైదరాబాద్ వస్తున్నాడు. ఒక రహస్య సమాచారం మేరకు అతన్ని హెచ్ఎన్ఈడబ్ల్యూ అధికారులు మసాబ్ ట్యాంక్ వద్ద అదుపులోకి తీసుకొని, అతని నుండి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.