16 April, 2026 | 12:05 PM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్

16-04-2026 10:43 AM

కొత్తపల్లి, ఏప్రిల్ 16(విజయక్రాంతి): కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ మల్కాపూర్ లో జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం కు బుధవారము జరిగిన ఎన్నికల్లో మాజీ అధ్యక్షులుగా పనిచేసిన గుంటపల్లి రవికుమార్ పై మాజీ ప్రధాన కార్యదర్శి కొత్త మహేష్ గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా పల్లె సంతోష్ కుమార్, కోశాధికారిగా గంగాధర నరేష్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించిన సభ్యులకు నూతన అధ్యక్షుడు కొత్త మహేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల అధికారిగా నరహరి లక్ష్మారెడ్డి , పర్యవేక్షకులుగా కార్పొరేటర్ కాంతాల జగన్ రెడ్డి  ,మాజీ సర్పంచ్ కాసారపు శ్రీనివాస్  వ్యవహరించినారు.