26-09-2025 12:00:00 AM
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 25, (విజయక్రాంతి):స్వచ్ఛత అనేది ఒక్కరోజు నిర్వ హించే కార్యక్రమం కాదని, ప్రతి పౌరుడు నిరంతరం ఆచరించాల్సిన బాధ్యత అని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. పరిశుభ్రతా కార్యక్రమాలు సమాజంలో నిత్యకృత్యంగా కొనసాగితేనే ఆరోగ్యవంతమైన, శుభ్రమైన, పచ్చదనంతో కూడిన వాతావరణం ఏర్పడుతుందని పిలుపు నిచ్చారు.
భారత ప్రధాని పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఆవరణలో ప్రత్యేక శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు.
విశ్వవిద్యాలయం ఆవరణలో గడ్డిని, పిచ్చిమొక్కలను తొలగించి పరిశుభ్రతను కాపాడే దిశగా అందరూ కలసికట్టుగా శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ఇంటి నుండి సమాజం వరకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రతి ఇంటి వద్దే చెత్తను వేరు వేరు డబ్బాలలో వేసి సక్రమంగా పారవేయాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పడేయరాదు అని అన్నారు.
మురుగు కాలువల్లో చెత్త పడితే నీటి ప్రవాహం ఆగిపోతుంది, దాంతో దోమల పెరుగుదల, పలు రకాల వ్యాధుల వ్యాప్తి జరుగుతుంది కాబట్టి ఈ విషయంపై ప్రతి పౌరుడూ జాగ్రత్తగా ఉండాలి అని సూచించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతేనని, సమాజం పరిశుభ్రంగా ఉండేలా అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధికారులతో పాటు విద్యార్థు లు, యువత ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొం టే భవిష్యత్ తరాలకు పచ్చదనం,
పరిశుభ్రతతో కూడిన సమాజాన్ని అందించగలమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా అధికారులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు స్వచ్ఛతకు కట్టుబడి ప్రతిజ్ఞ చేసి, ప్రతి ఒక్క రూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు కట్టుబడి ముందడుగు వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఏడి మైన్స్ దినేష్, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెం ట్ ఏడి రమేష్, మెప్మా పీడీ రాజేష్ మరి యు జిల్లా ఉద్యోగులు, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.