calender_icon.png 2 June, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే నిలుపుదల చేయాలి

31-05-2025 04:01:33 PM

సర్దుబాటు పేరుతో ప్రాథమిక పాఠశాలల మూసివేత సరికాదు

బడిబాటను చిత్తశుద్ధితో నిర్వహించి ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలి

టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్ కుమార్ డిమాండ్

కామారెడ్డి,(విజయక్రాంతి): ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులను వెంటనే ప్రభుత్వం నిలుపుదల చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సకినాల అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు పెడితే ప్రాథమిక పాఠశాల ల మూసివేత సరికాదని అన్నారు. బడిబాటను చిత్తశుద్ధితో నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యాశాఖ పాఠశాల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తాం అనే నమ్మకాన్ని కలిగించాలన్నారు. బడిబాటలో విద్యార్థుల నమోదు పెంచాలని ఒకవైపు చెప్తూనే మరొకవైపు విద్యాశాఖ 28 మే 2025 ఉత్తర్వులు ప్రకారం పాఠశాలల పున ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు.

ఆశాస్త్రీయంగా నిబంధనలు రూపొందించడానికి టిపిటిఎఫ్ వివరంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు పాఠశాలల మూసివేతకు దారి తీస్తున్నాయని వెంటనే ఉత్తర్వులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో 10 సంవత్సరాలలోపు విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు 60 మంది విద్యార్థు లకు ఇద్దరు ఉపాధ్యాయులు, 90 లోపు విద్యార్థులకు ముగ్గురు ఉపాధ్యాయులు ఉండాలని నిబంధన విధించడం సరి కాదన్నారు. ఇట్లాంటి ఆ సంబంధమైన నిబంధన వల్ల తల్లిదండ్రులు ఏ నమ్మకంతో తమ పిల్లల్లాలను ప్రాథమిక పాఠశాలలో నమోదు చేస్తారో ప్రభుత్వమే ఆలోచించాలన్నారు. ఇట్లాంటి నిబంధనల వల్ల ప్రాథమిక పాఠశాలలో మూసివేతకు లోనవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గత సంవత్సరం నమోదైన విద్యార్థుల సంఖ్యతో పాఠశాలల ప్రారంభంలోపే సర్దుబాటు చేయడం వల్ల పాఠశాలలకు నష్టం జరుగుతుందన్నారు. బడిబాట అనంతరం జూన్ 30వ తేదీ నాటికి నమోదైన విద్యార్థుల సంఖ్య తో సర్దుబాటు చేసేలా ఉత్తర్వులు సరీ చేయాలని అన్నారు. ప్రాథమిక పాఠశాలలో కనీసం 20 విద్యార్థుల్లో పిల్లలకు ఇద్దరు ఉపాధ్యాయులు 40 విద్యార్థుల లోపు పిల్లలకు ముగ్గురు ఉపాధ్యాయులు 60 మంది పిల్లల వరకు నలుగురు ఉపాధ్యాయులు, 60 మందికి పైగా విద్యార్థులు ఉన్న పాఠశాలలకు ఐదుగురు ఉపాధ్యాయులు ఉండేలా ఉత్తర్వులు సవరణ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు బాధ్యతగా బడిబాటను విజయవంతం చేసేలా టి పి టి ఎఫ్ సహకరిస్తుందన్నారు. ఈ సమావేశంలో టీపిటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నే బోయిన తిరుపతి పాల్గొన్నారు.