31-05-2025 03:54:54 PM
టీజేఎఫ్ రజతోత్సవ సంబరాలో నారాయణపేట
ఆర్డీఓ రామచందర్ నాయక్
నారాయణపేట,(విజయక్రాంతి): జర్నలిజం ఒక పవిత్రమైన వృత్తి అని, సమాజాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమైందని నారాయణ పేట ఆర్డీవో రాంచందర్ నాయక్(Narayanpet RDO Ramchandra Nayak) అన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 25 వసంతాల వేడుకల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోనీ అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ 143 ఆధ్యర్యంలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ సంబరాలలో ఆర్డీఓ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాజ్యంగా నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి జర్నలిస్టులతో కలిసి ఆర్డీవో రామచందర్ నాయక్ పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు. ఆ తర్వాత ఆ యూనియన్ జర్నలిస్ట్ లతో కలిసి కేక్ కట్ చేశారు. బాణసంచా పేలుస్తూ జర్నలిస్టుల సంబరాలు చేసుకున్నారు. తెలంగాణ జర్నలిస్టల ఫోరం కన్వీనర్ అల్లం నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ జర్నలిస్టూల నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్ట్ ల పాత్ర ఎంతో కీలకమైందన్నారు.
తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సంబరాలకు తరలివెళ్ళిన జర్నలిస్టులు
తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ 143 జాతీయ కార్యవర్గ సభ్యులు వారధి నవీన్ కుమార్ రెడ్డి
టీయూడబ్ల్యూజేహెచ్ 143 జిల్లా అధ్యక్షులు కలాల్ ఆనంద్ కుమార్ గౌడ్
తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకపాత్ర పోషించిన టీజేఎఫ్ 25 వసంతాల సంబరాలు జరుపూకునేందుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ హెచ్ 143 జాతీయ కార్యవర్గ సభ్యులు వారధి నవీన్ కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు కలాల్ ఆనంద్ కుమార్ గౌడ్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు అవుటి రాజశేఖర్ , నారాయణ పేట ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డిల నేతృత్వంలో ప్రత్యేక వాహనాలు ఛలో జల విహార్... ఛలో హైదరాబాద్ అంటూ బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... దశాబ్దాల పాటు దగా పడ్డ తెలంగాణ ప్రజల విముక్తి కోసం మలిదశ ఉద్యమంలో టిజెఫ్ రాష్ట్ర అధ్యక్షులు , తెలంగాణ ప్రెస్ అకాడమీ తొలి చైర్మన్ అల్లం నారాయణ సార్ నేతృత్వంలో జర్నలిస్టులను చైతన్య పరచడంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం కీలక పాత్ర పోషించిందన్నారు. ఇది కలం కవాతు. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టు అనే నినాదాన్ని మరోసారి గుర్తు చేశారు.