18 July, 2026 | 7:10 PM

Breaking News

నాణ్యమైన విద్యకు కేరాఫ్ ప్రభుత్వ పాఠశాలలు   •   పరిసరాల సేవా వీరులు   •   మిర్యాల కాంగ్రెస్ కార్యకర్త మెంచు లింగమల్లు దశదిన కర్మకు ఆర్థిక సహాయం   •   ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో పాత్రికేయుల పాత్ర అంత్యంత కీలకం   •   విద్యార్థులలో క్రమశిక్షణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యాభివృద్ధి   •   'ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన'ను తక్షణమే అమలు చేయాలి   •   గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నాం: ఎమ్మెల్యే జారె, ఎంపీ రఘురామిరెడ్డి   •   తల్లిదండ్రుల సహకారంతోనే పాఠశాలల అభివృద్ధి   •   అర్హులైన ఓటర్లను జాబితాలో చేర్చాలి   •   ఎల్నీనో ప్రభావం గురించి రైతులకు అవగాహన కల్పించిన ఏవో   •  

ఆదాయం పెంచుతాం.. పెంచిన ఆదాయం పంచుతాం

01-07-2024 11:35 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...  అందరూ సమిష్టిగా  కలిసి పనిచేద్దాం. సంపద సృష్టిస్తాం.. ఆదాయం పెంచుతాం.. పెంచిన ఆదాయం పంచుతాం అని పేర్కొన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే నిజమైన సంక్షేమం అన్నారు. ప్రజల జీవన ప్రమాణాల పెంపులో మొదటి అడుగు పడిందన్నారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్ చెప్పారని గుర్తుచేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పేదలపై శ్రద్ధ పెడతాం.. అనునిత్యం వినూత్నంగా ఆలోచిస్తామని తెలిపారు. ఆర్థిక అసమానతలు లేని సమాజం చూడాలనేదే తన ఆలోచన అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెన్షన్ లు ప్రారంభించింది అన్న ఎన్టీఆర్ అని సీఎం స్పష్టం చేశారు. నాడు రూ.35 పెన్షన్ ఇచ్చారు. తరువాత 1995లో రూ.75 చేసాం. 2014లో రూ.200 ఉన్న పెన్షన్ ని వెంటనే రూ.1000 పెంచి, మళ్ళీ మరొక రూ.1000 పెంచి రూ.2000 పెంచాం. మళ్ళీ ఇప్పుడు రాగానే రూ.3 వేల పెన్షన్ ని, వెయ్యి పెంచి రూ.4 వేలు చేసామని చంద్రబాబు తెలిపారు.