13-11-2025 01:13:56 AM
లక్ష రూపాయల ప్రభుత్వ ప్రోత్సాహకం
హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): రాష్ర్టం నుంచి సివిల్స్ మెయిన్స్ ఫలితాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. రాజీవ్ సివిల్స్ అభయ హస్తం సాయం అందుకున్న అభ్యర్థుల్లో 43 మంది తాజాగా యూపీఎస్సీ మెయిన్స్ ఫలితాల్లోనూ విజేతలుగా నిలవడం అభినందనీయమన్నారు. రాష్ర్టం నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థులకు ప్రభుత్వం రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించింది. ఈ ఏడాది రాజీవ్ సివిల్స్ అభయ హస్తం కింద సింగరేణి సంస్థ అధ్వర్యంలో మెయిన్స్కు వెళ్లిన 202 మందికి గతేడాది మాదిరిగా ఈసారి కూడా ఇంటర్వ్యూలకు సన్నద్ధం అయ్యేందుకు మరో లక్ష రూపాయల ప్రోత్సాహకం ప్రభు త్వం అందించనుంది.