14 July, 2026 | 6:42 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

సివిల్స్ ఫలితాలు విడుదల

13-11-2025 01:12 AM

2,736 మంది ఇంటర్వ్యూలకు ఎంపిక

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాం తి): యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షా ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విదుదల చేసింది. దేశ వ్యాప్తంగా 2,736 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు ఎంపికైనట్లు ప్రకటిం చింది. తెలంగాణ నుంచి 43 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఆగస్టు 22 నుంచి 31 వరకు సివి ల్స్ మెయిన్స్ పరీక్షలు జరిగాయి.

మెయిన్స్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను యూపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత మెయిన్స్, ఇంటర్వ్యూకి కలిపి వచ్చిన మొత్తం మార్కులతో మెరిట్ లిస్ట్ విడుదల చేస్తారు. అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూల తేదీని త్వరలోనే యూపీఎస్సీ ప్రకటించనుంది.