29-07-2025 01:39:18 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్, జులై 28 : అభాగ్యులకు అండగా భరోసాగా సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంఅన్నారు. సోమవారంనకిరేకల్ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నకిరేకల్ మండలంలోని 93 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు.అనంతరం క్షయ బాధితులకు న్యూట్రిషన్ కిట్స్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుత్తా మంజులమాధవ్ రెడ్డి, స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత శ్రీనివాస్, పిఏసియస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మండల పార్టీ అధ్యక్షులు నకిరెకంటి ఏసుపాదం, సీనియర్ నాయకులు పన్నాల రఘవరెడ్డి, లింగాల వెంకన్న, గాదగోని కొండయ్య స్థానిక కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.