31 March, 2026 | 2:11 PM

Breaking News

వెలుగులోకి కల్తీ అల్లం పేస్ట్ వ్యవహారం... హైదరాబాద్‌లో వ్యాపారి అరెస్టు   •   చైత్ర మాసం చివరి రోజున ఆలయంలో తొక్కిసలాట: 8 మంది మృతి   •   గురుకుల విద్యను సద్వినియోగం చేసుకోవాలి   •   ఈదురు గాలులకు నేలకొరిగిన వరి, జొన్న పంట   •   మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరం — రైతుల నుంచి విశేష స్పందన   •   హైదరాబాద్‌లో జయలలిత ఇంటికి సీల్   •   ఆకాల వర్షాలకు పంటలు ఆగం.. తీవ్ర ఆందోళ‌న‌లో నిజామాబాద్ రైతులు   •   బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు   •   పట్టాలు తప్పిన గూడ్స్.. ట్రాక్‌పై అడ్డంగా పడిన పాల ట్యాంకర్   •   ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం   •  

న్యాయం, సమానత్వం సాధించేలా విజన్ డాక్యుమెంట్: సీఎం

09-12-2025 08:54 PM

హైదరాబాద్‌: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో అన్ని సెషన్లు ముగిశాయి. అనంతరం ముగింపు వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాట్లాడుతూ.. తెలంగాణ నేల చైతన్యవంతమైన నేల అని.. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో పోరాటాలు జరిగాయని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సామజిక న్యాయం, సమానత్వం సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామని.. 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంతో ప్రధాని మోదీ ముందుకు సాగుతున్నారన్నారు.

కేంద్ర లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ కూడా లక్ష్యాలు నిర్దేశించుకున్నాయని.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదగాలనే లక్ష్యం పెట్టుకున్నామని అన్నారు. పేదలు, రైతులు, వ్యాపారులు, యువతకు అభివృద్ది ఫలాలు దక్కేలా డాక్యుమెంట్ రూపకల్పన చేశామని.. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ముఖ్యమని తొలి ప్రధాని నెహ్రూ భావించారన్నారు. అందుకే నెహ్రూ యూనివర్సిటీలు, సాగునీటి ప్రాజెక్టులు ఎక్కవగా నిర్మించారని.. నెహ్రూ చూపిన మార్గం చిరకాలం అనుసరణియమైనదని అన్నారు. కులం, మతం ఆధారంగా విద్యాసంస్థలు ఉండటం సరికాదని.. అన్ని కులాల వారు, మతాల వారు ఒకేచోట చదవాలనేది నా ఆశయం అని తెలిపారు. జాతి వివక్షను ప్రోత్సహించేలా విద్యా విధానం ఉండొద్దన్నారు.