calender_icon.png 6 June, 2025 | 11:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్

19-05-2025 12:28:59 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ముఖ్యమంత్రి పర్యటించారు. రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి మాచారం బయలుదేరారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటీ శ్రనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు తదితరులు ఉన్నారు. తెలంగాణలోని గిరిజనుల కోసం రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూ.12,600 కోట్లతో చేపట్టిన ఇందిరా సౌర గిరి జల వికాస పథకాన్ని ఇవాళ  మాచారంలో ప్రారంభించారు. 2.10 లక్షల మంది గిరిజన రైతులకు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించటమే ఈ పథకం లక్ష్యం.