15 March, 2026 | 9:00 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి

11-12-2025 11:52 AM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రయాంక గాంధీని కలిశారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పనితీరు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించినట్లు సమాచారం. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం, పెట్టుబడుల వివరాలను సోనియా గాంధీకి వివరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సీఎంతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్ ఎంపీలు సోనియాతో భేటీ అయ్యారు.