27-07-2025 10:02:28 AM
హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహానీయునికి ఘనంగా నివాళులర్పించారు. విజ్ఞానానికి ప్రతీకగా, విద్యార్థులు, యువతకు మార్గదర్శకునిగా నిలిచిన కలాం తన జీవితం మొత్తాన్ని దేశసేవకు అంకితం చేసిన మహాత్ముడని ఆయన గుర్తుచేసుకున్నారు. కలాం ఆశయాలను స్మరించుకుంటూ, ప్రతి ఒక్కరు వారి విలువలు, ఆలోచనలను అనుసరిస్తూ స్ఫూర్తితో ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.