4 July, 2026 | 10:13 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

కన్యాకుమారి-పూణె జయంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు

27-07-2025 10:26 AM

హైదరాబాద్: అన్నమయ్య జిల్లా నందలూరు వద్ద కన్యాకుమారి-పూణె మధ్య జయంతి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు అలుముకున్నాయి. దీంతో రైలులోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఏసీ బోగీలోని కింది భాగంలో పోగలు రావడం గమనించిన ప్రయాణికులు గార్డుకు సమాచారం అందించడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై రైలును నందలూరు రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. బోగిలోని ప్రయాణికులను కిందకు దించి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రైలు చక్రాల సమీపంలో బ్రేకుల వద్ద పోగలు వస్తున్నాయని గుర్తించిన సిబ్బంది రైలుకు మరమ్మతులు నిర్వహించారు. అనంతరం రైలు బయలుదేరింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి మరణం సంభవించలేదని రైల్వే అధికారులు వెల్లడించారు.