28-06-2025 07:22:39 PM
హైదరాబాద్: హైదరాబాద్ లో కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని, డీజిల్ బస్సులను నగరానికి అవతలకు పంపించే చర్యలు చేపట్టామన్నారు. నగరంలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తిరిగేలా చూస్తామని, ఎలక్ట్రిల్ కార్లు, ఆటోలు కొంటున్న వారికి పన్నులు లేకుండా చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నాలాలు కబ్జాలకు గురవడం వల్లే నగరంలో ముంపు తీవ్రత పెరిగిందని, వరద నీళ్లు వెళ్లేందుకు చెరువు లేకుండా కొందరు కబ్జాలు చేశారని, చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చివేసిందని సీఎం వివరించారు. హైదరాబాద్ పై ఒత్తిడి పెరుగుతున్నందునే 30 వేల ఎకరాల్లో భారత్ ప్యూచర్ సిటీని చేపట్టామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒకప్పడు నిర్మానుష్యంగా కనిపించిన హైటెక్ సిటీ ప్రాంతం ఇప్పడు ప్రజలు నిద్రపోని ప్రాంతంగా హైటెక్ సిటీ మారిపోయింది. నగరంలో అత్యధిక పన్నులు వస్తున్న ప్రాంతంగా హైటెక్ సిటీ ఎదిగిందని ఆయన కొనియాడారు. భవిష్యత్ లో ఫ్యూచర్ సిటీ కూడా హైటెక్ సిటీ వలే అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.