08-12-2025 04:34:36 PM
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలో తెలంగాణ కల సాకారమైందని, తెలంగాణ దేశంలోనే కొత్త రాష్ట్రమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అన్ని రంగాల నిపుణులు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని, దేశ జనాభాలో తెలంగాణ 2.9 శాతమే ఉన్నప్పటికి 5 శాతం ఆదాయం ఇస్తున్నామని సీఎం గుర్తు చేశారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించామని, ఆ మూడు జోన్లను సేవ, తయారీ, వ్యవసాయ రంగాలకు కేటాయించామని ఆయన తెలిపారు.
వాటిని క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా పిలుచుకుంటున్నామని, చైనాలోని గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ స్పూర్తిగా ముందుకెళ్తున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. గ్వంగ్ డాంగ్ ప్రావిన్స్ 20 ఏళ్లలోనే అత్యధిక పెట్టుబడులు సాధించిందని, తెలంగాణలో గ్వంగ్ డాంగ్ నమూనా అమలు చేయదలిచినట్లు చెప్పారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ మాకు ఆదర్శమని, కొత్త రాష్ట్రమైన తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నామని, 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలనేది మా ఆశయమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం కూడా 2047 నాటికి నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీని లక్ష్యంగా పెట్టుకున్నదని, జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలనేది మా ఆశయం అన్నారు. పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తల నుంచి ఆలోచనలు ఆహ్వానిస్తున్నామని, లక్ష్యం పెద్ది అయినప్పటికీ కష్టపడి సాధిస్తామనే నమ్మకం మాకుందని ముఖ్యమంత్రి తెలిపారు. అందరి సహకారంతో మా లక్ష్యాన్ని అందుకుంటామని,