05-12-2024 10:03:16 PM
జుక్కల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో పలువురు పేద ప్రజలు అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందగా బాధిత కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు గురువారం అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహయాన్ని పేద ప్రజలకు అందజేసినట్లు తెలిపారు.