21-02-2026 12:00:00 AM
సనత్నగర్ ఫిబ్రవరి 20 (విజయ క్రాంతి):- అనారోగ్యానికి గురైన మహిళకు మెరుగైన చికిత్స కోసం ముఖ్యమంత్రి సహా య నిధి మంజూరు పత్రాన్ని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. సనత్ నగర్లోని బికె గూడకు చెందిన బొడ్డు స్వప్న నరాల సంబంధ సమస్యతో కొద్దికాలంగా బాధపడుతున్నది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆమె భర్త శ్రీకాంత్ గౌడ్ మెరుగైన వైద్యం చేయించలేకపోయారు.
తన భార్య చికిత్స కోసం సహాయం అందించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను శ్రీకాంత్ గౌడ్ ఆశ్రయించి కోరారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ చొరవతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయం మంజూరైంది. శుక్రవారం వెస్ట్ మారేడ్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీకాంత్గౌడ్కు ఆర్ధిక సహా యం మంజూరు పత్రాన్ని అందజేశారు.