19-11-2025 04:04:25 PM
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్
కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో బుధవారం సుంకరి భాగ్య, సమీర్, పోతరాజుల కవితకు మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ సీఎం సహాయనిధి పథకం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు.ఆపద సమయంలో సంజీవినీలా పని చేస్తోందని పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.