27-05-2025 12:02:39 AM
ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
మేడ్చల్, మే 26(విజయ క్రాంతి): అనారోగ్యం పాలై, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన వారు సీఎంఆర్ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు.
సోమవారం శ్రీ పట్టణానికి చెందిన గోగీకర్ లక్ష్మణ్ కు మంజూరైన రూ. 85000, అడ్రస్ పల్లి కి చెందిన లక్ష్మికి మంజూరైన రూ. 55500 చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకున్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
సిఎంఆర్ఎఫ్ మంజూరు చేయించిన ఎమ్మెల్యే మల్లారెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీసీ సెల్ అధ్యక్షుడు మండల రవి కుమార్, రెండో వార్డు అధ్యక్షుడు మండల ఈశ్వరయ్య, చంద్రశేఖర్, దేవరాజు గౌడ్, ఉద్దెమర్రి కి చెందిన సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.