27-05-2025 12:01:25 AM
కేంద్ర పరిశ్రమలు శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ
కుత్బుల్లాపూర్,మే 26(విజయ క్రాంతి): దేశంలో మహిళా పారిశ్రామిక వేత్తల అభ్యున్నతికీ భారత ప్రభుత్వం చేయూతనిస్తుందని కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీ అ న్నారు.
గాజులరామారం మిథిలానగర్ లో గల ఎలీఫ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సోమవారం ఉద్యమి నుంచి ఉన్నతి -వికసిత్ భారత్ కోసం మహిళా పారిశ్రామిక వేత్తలతో భవిష్యత్ నిర్మాణం అనే అంశం పై జరిగిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథి గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పలువురు మహిళా అంకుర సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉత్పత్తులను కేంద్ర మంత్రి ప రిశీలించారు. పలువురు చేసిన పర్యావరణ హిత ఉత్పత్తులను మంత్రి తిలకించి ఆయా ఉత్పత్తుల పనితీరు, చేసిన విధానాలను తెలుసుకుని మహిళా ఎంట్ర్పనర్ లను అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు ప్రపంచ సవాళ్లను తెలుసుకుని వాటికీ అనుగుణంగా ఎదుగుతూ ఆర్ధిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని సూచించారు. కేంద్ర ప్రభు త్వం ఎల్లప్పుడు మహిళా పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రోత్సాహకాలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.
ఎలీఫ్ ఇండస్ట్రీస్ చైర్ పర్సన్ రమాదేవి నూతన మహిళా ఎంట్ర్పనర్స్ ను ఉత్పత్తి చేసేందుకు నిరంతరం శ్రమిస్తుందని కేంద్ర మంత్రికి వివరించారు. ఇన్నోవేషన్ మరియు సుస్థిరతపై ప్రేరణాత్మక షేషన్స్,మహిళా పారిశ్రామిక వేత్తల విజయ గాథలు,సమగ్ర గ్రీన్ ఇండస్ట్రియల్ అభివృద్ధిపై చర్చలు, గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులు, ఔత్సాహిక వాతావరణం లో ఎలీఫ్ పాత్ర అనే అంశాలపై చర్చను సాగించారు.
ఈ కార్యక్రమంలో పీఎం విశ్వకర్మ ఎం ఎస్ ఎం ఈ కేంద్ర మంత్రిత్వ శాఖ డైరెక్టర్ మిలింద్ ధర్మారావు రాంటికే,సూచ్మ,చిన్న మరియు మధ్య తరహా మంత్రిత్వ శాఖ సంయుక్త సంచాలకులు మెర్సీ ఏపావో తదితరులుపాల్గొన్నారు.