27-05-2025 12:04:28 AM
- కార్పొరేటర్లు పవన్ కుమార్, రాధా ధీరజ్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి
- ఎల్బీనగర్ నియోజకవర్గంలో జోనల్ కమిషనర్ పర్యటన
ఎల్బీనగర్, మే 26 : ఎల్బీనగర్ నియోజకవర్గంలో వరద సమస్యను పరిష్కరించా లని జీహెచ్ఎంసీ అధికారులను కార్పొరేటర్లు కోరారు. కొత్తపేట, ఆర్కేపురం, వనస్థ లిపురం డివిజన్లలో సోమవారం జీహెచ్ఎం సీ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటి ల్, కార్పొరేటర్లు పవన్ కుమార్, రాధా ధీర జ్ రెడ్డి, రాగుల వెంకటేశ్వర్ రెడ్డి పర్యటించి, స్థానిక సమస్యలను తెలుసుకున్నారు.
కొత్తపేట, ఆర్కేపురం డివిజన్ మీదుగా ఎల్బీనగ ర్ నుంచి అల్కాపురి జంక్షన్ వరకు వేస్తున్న పైపు లైన్ పనులను కమిషనర్, కార్పొరేట ర్లు పరిశీలించారు. అల్కాపురి జంక్షన్ నుంచి స్ట్రామ్ వాటర్ పైప్ లైన్ మూసీ వరకు సరైన డ్రైనేజీ అవుట్ లెట్ లైన్ లేదని, ఔట్ లైన్ పనులను సరిగ్గా పరిశీలించి అ ల్కాపురి జంక్షన్ నుంచి మూసీ వరకు పైపు లైన్ కలపాలని కార్పొరేటర్లు సూచించారు.
భారీ వర్షాలు కురిసినపుడు న్యూ నాగోల్, సమితపురి కాలనీలతోపాటు జలమయం అవుతున్నాయని వివరించారు. ఎల్బీనగర్ నుంచి కొత్తపేట మూసీ వరకు అవుట్ లెట్ పైప్ లైన్ పనులకు రూ. 40 కోట్లతో జీహెచ్ఎంసీ, జలమండలి ఆధ్వర్యంలో అంచ నాలు వేయించి అవుట్ లెట్ ఏర్పాటు చేయించాలని కోరారు.
కాలనీల్లో వరద నీటి సమస్యలు తలెత్తకుండా శాశ్వతమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. స్ట్రాం వాటర్ పైప్ లైన్ అవుట్ లెట్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని, మూసీ వరకు ఔట్ లైన్ పనులపై అంచనాలను వేయిస్తామని జోనల్ కమిషనర్ కు తెలిపారు. పర్యటనతో జీహెచ్ఎంసీ, జలమం డలి అధికారులు, కాలనీ వాసులు నాయకులు పాల్గొన్నారు.
- వనస్థలిపురం డివిజన్ లో జోనల్ కమిషనర్ పర్యటన
వనస్థలిపురం డివిజన్ లో వరద నీటి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరారు. కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పటేల్ తదితరులు వనస్థలిపురం డివిజన్ అన్ని కాలనీల్లో పర్యటిం చారు. డ్రైనేజ్, పార్కు సమస్యలు, సీసీ రోడ్డు సమస్యలను పరిష్కరించాలని కోరారు. కాలనీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని జీహెచ్ఎంసీ జోనూ కమిషనర్తెలిపారు.