26-06-2025 12:39:48 AM
పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్
హైదరాబాద్, జూన్ 25 (విజయక్రాంతి): నగరంలోని హైటెక్సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో నడుస్తున్న కో-లివింగ్ విధానం దుర్మార్గమని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు మండిపడ్డారు. ఈ విధానాన్ని ఆపాలని సీఎం రేవంత్రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబును కోరారు. బుధవారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడు తూ.. ఒకే హాస్టల్లో ఆడపిల్లలు, మ గ పిల్లలు కలిసి ఉండటం సరికాదన్నారు.
హైదరాబాద్ నెంబర్వన్ సిటీ కావాలంటే ఇలాంటి వాటిని ప్రభుత్వం కట్టడి చేయాలని వీహెచ్ సూచించారు. కో-లివింగ్ను కట్టడి చేసేందుకు ఎన్ఎస్యూఐ నాయకులు దృష్టి పెట్టాలన్నారు. మానవ హక్కుల నాయకులు నక్షలైట్ల హత్యలపై మాట్లాడుతారని, కానీ లవర్ మర్డర్స్పైన ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ఇలాంటి వాటిపైన మా నవ హక్కుల సంఘాలు పట్టించుకోవాలని వీహెచ్ సూచించారు. సైకాల జిస్టులు, మేధావులు కూడా ఆలోచన చేయాలని, ఎక్కడ తప్పు జరు గుతుందనేది తెలుసుకుని స్పందించాలన్నారు.