01-11-2025 05:13:23 PM
ఇల్లెందు,(విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియా జిఎం కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో అక్టోబర్ నెల బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత వివరాలను ఏరియా జి.యం వీసం కృష్ణయ్య తెలిపారు. అక్టోబర్-2025 నెలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి 5.00 లక్షల టన్నులకు గాను 1.81 లక్షల టన్నుల బొగ్గు తీసి మొత్తం 36 శాతం ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. అలాగే 0.38 లక్షల టన్నుల బొగ్గును రైల్వే మార్గం ద్వారా, 0.57 లక్షల టన్నులు రోడ్డు మార్గం ద్వారా, ఆర్.సి.హెచ్.పి ద్వారా 1.10, ఇల్లందు ఏరియా లో మొత్తం 2.05 లక్షల టన్నుల బొగ్గు బట్వాడా చేయడం జరిగిందని తెలిపారు. అక్టోబర్ నెలలో 11 రేకుల ద్వారా బొగ్గు రవాణా చేసామన్నారు. అదేవిధంగా ఇల్లందు ఏరియాకు కేట౦చిన వార్షిక బొగ్గు లక్ష్యం 23.83 లక్షల టన్నులకు గాను 14.35 లక్షల టన్నులు బొగ్గు ఉత్పత్తి చేసి 60% ఉన్నామని తెలిపారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి కృషి చేసిన సంబంధిత అధికారులు, సూపర్వైజర్స్, యూనియన్ నాయకులకు, ఉద్యోగులకు జి.యం ప్రత్యేకం అభినందనలు తెలిపారు.