ట్రాక్టర్ బోల్తా... డ్రైవర్ మృతి
13-06-2026 04:03 PM
పాల్వంచ,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని శేఖరంబంజరు సమీపంలోనీ రామస్వామి గుంపులో శనివారం జరిగిన ప్రమాదంలో కర్క శ్రీను (28) అక్కడికక్కడే మృతి చెందారు. పొలంలో దుక్కి దున్నుతున్న సమయంలో ట్రాక్టర్ బోల్తాపడటంతో ఈ ప్రమాదం సంభవించింది. నెల్లిపాక బంజరు కృష్టారం గ్రామానికి చెందిన శ్రీను అక్కడికక్కడే మృతి చెందారు. పాల్వంచ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






