07-12-2025 12:06:53 AM
సిర్పూర్లో 8.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): రాబోయే రెండు మూడు రోజులు రాష్ట్రంలో శీతల గాలులు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈమేరకు వాతావారణ శాఖ శనివారం తెలిపింది. సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా పలు ప్రాంతాల్లో నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. శీతలగాలులు మాత్రం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెద క్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశముందని హెచ్చరించింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా గతేడాది ఇదే రోజు కంటే తక్కువగా 8.0 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీమ్పూర్లో 9.4 డిగ్రీలు, సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 10.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.