11 August, 2026 | 5:37 PM

Breaking News

ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా మల్యాల అంజయ్య నియామకం   •   దన్నూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల యూనిఫామ్ డ్రస్సుల కుట్టడం త్వరలో పూర్తి చేయాలి   •   రామప్ప నుండి గణప సముద్రానికి నీటిని తరలించాలి   •   జొన్న రైతుల డబ్బుల విషయంలో ఆందోళన వద్దు   •   రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో బంగారు, రజిత పథకాలు సాధించిన ఐపీఎస్‌ విద్యార్థులు   •   మాల్తుమ్మెద గ్రామంలో గడ్డి మందు పిచికారి   •   చలివాగు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి   •   భిక్కనూర్‌లో సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   రోడ్డు సౌకర్యంతో పాటు తాగునీరు అందించండి మహాప్రభో   •  

శుభ్రమైన తాగునీరు అందించండి..

06-08-2024 04:42 PM

లీకేజీలను వెంటనే మరమ్మతు చేయండి : జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి

మహబూబ్ నగర్: స్వచ్ఛదనం.. పచ్చదనం కార్యక్రమంలో భాగంగా మంగళవారం మహబూబ్ నగర్ మండలం మన్యం కొండలో గల మిషన్ భగీరథ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి సందర్శించారు. 70 ఎంఎల్డీ  మిషన్ భగీరథ  ట్రీట్ మెంట్ ప్లాంట్ ద్వారా సురక్షిత  త్రాగు నీరు సరఫరా, త్రాగు నీరు టెస్టింగ్ ల్యాబ్ ద్వారా నీరు కలెక్టర్ పరీక్షించారుమిషన్ భగీరథ ట్రీట్ మెంట్ ప్లాంట్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లాలో 78 ఆవాసాలకు తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న సందర్భంగా ఎక్కడైనా పైపులైన్లు లీకేజీ అయితే వెంటనే మరమ్మతులు చేసి మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మొక్కను నాటి నీరు పోశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ ఈ జగన్ మోహన్, ఈఈ ఇంట్రా పుల్లా రెడ్డి, ఈఈ గ్రిడ్ వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.