calender_icon.png 12 December, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎరువుల గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్

12-12-2025 12:00:00 AM

నిజామాబాద్, డిసెంబర్ 11  (విజయ క్రాంతి): రబీ సీజన్ పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ఎడపల్లి మండలం జానకంపేటలోని సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గిడ్డంగిలో రికార్డులలో పేర్కొన్న విధంగా ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయా అని పరిశీలించారు. ఎరువుల విక్రయాలను ఈ-పాస్ ద్వారా నిర్వహిస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు.

స్టాక్ కొంత మిగిలి ఉన్నప్పుడే ఇండెంట్ సమర్పించి, ఎరువులను గోడౌన్ కు తెప్పించుకోవాలని నిర్వాహకులకు సూచించారు. కాగా, ఎరువుల నిల్వలతో కూడిన వివరాలను స్టాక్ బోర్డు పై తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అన్ని ప్రాంతాలలో రైతులకు ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామని ఈ సందర్భంగా కలెక్టర్ అన్నారు. యూరియా, ఇతర ఎరువుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా కల్పించారు.