21-01-2026 03:52:03 PM
కుమ్రం భీం అసిఫాబాద్,(విజయక్రాంతి): పత్రికలు ప్రభుత్వానికి ప్రజల మధ్య వారదులుగా నిలువాలని జిల్లా కలెక్టర్ కె. హరిత ఆకాంక్షించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో గల తన చాంబర్ లో విజయ క్రాంతి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమం పథకాల అమలులో మీడియా కీలకంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ క్రాంతి స్టాఫ్ రిపోర్టర్ చిప్ప సురేష్,రిపోర్టర్ రహీద్ పాషా తదితరులున్నారు.