ఈఆర్సి ఛైర్మన్ జస్టిస్ నాగార్జున్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్
06-03-2026 09:39 PM
హనుమకొండ,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ డాక్టర్ దేవరాజు నాగార్జున్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యుత్ సంబంధిత అంశాలపై హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో చేపట్టిన బహిరంగ విచారణ నిమిత్తం హనుమకొండలోని హరిత కాకతీయ కు చేరుకున్న జస్టిస్ నాగార్జున్ ను కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, టీజీఎన్పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత తదితరులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు, పూల మొక్కలను అందజేశారు.




