28 June, 2026 | 8:10 AM

ల్యాండ్‌బ్యాంక్ గుర్తింపునకు కమిటీ

14-06-2024 12:15 AM

ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్, జూన్ 13 (విజయక్రాంతి): అటవీ పెంపకానికి ల్యాండ్ బ్యాంక్ గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమిం చింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వు లు జారీ చేసింది. కమిటీ చైర్మన్‌గా ప్రిన్సిఫల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్  ఫారెస్ట్ వ్యవహరించనున్నారు. సభ్యులుగా సీసీఎల్‌ఏ అధికారి, పర్యావరణ అట వీశాఖ అధికారి, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్  అధికారులు ఉంటారు. ఈ కమిటీ వివిధ వర్గాల అటవీయేతర భూములు సేకరించి అడవుల పెంప కానికి తీసుకోవాల్సిన చర్యలతో పాటు  అంతరించిపోతున్న జంతువు లు కాపాడటం తదితర అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది.