4 July, 2026 | 10:51 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

నష్టపరిహారాన్ని సద్వినియోగం చేసుకోవాలి

28-03-2025 12:07 AM

వికారాబాద్, మార్చ్-27ప్రభుత్వం అందజేస్తున్న నష్టపరిహారాన్ని రైతులు సద్విని యోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్  అన్నారు. గురువారం కలెక్టరేట్ వీడి యో కాన్ఫరెన్స్ హాలు నందు  కొడంగల్ నియోజకవర్గం, దుద్యాల మండలం, హకీంపేట కు సంబంధించిన పట్టా భూమి కలిగిన రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స మ్మతి తెలిపిన రైతులకు  తాండూర్ సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్  లతో కలిసి నష్ట పరిహార చెక్కులను జిల్లా కలెక్టర్ అందజేశారు.

ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ... పారిశ్రామిక పార్కు లో భూములను కేటాయించిన రైతులకు ఓకే  విడత లో నష్టపరిహార చెక్కులను అందజేయడం జరిగిందన్నారు.భూములు కోల్పో యిన రైతులు  నష్టపరిహారం ద్వారా తమ కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వినియోగించుకోవాలని కలెక్టర్  తెలిపారు.

దుద్యాల మండలం,  హకీంపేటలో పట్టా భూమి కలిగిన 32 మంది రైతులు 29 ఎకరాల భూమిని  పారిశ్రామిక పార్క్ కు తమ భూములను కేటాయించేందుకు సమ్మతి తెలుపనైనది.  పారిశ్రామిక పార్కు కు భూములను కేటాయించిన రైతులకు నష్టపరిహారం కింద 5,80,00,000 /-కోట్ల రూపాయల  చెక్కులను అందజేయడం జరిగిందన్నారు.