4 July, 2026 | 9:35 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ధోబీఘాట్ బస్తీలోతాగునీటి పబ్లిక్ నల్లా ఏర్పాటు

28-03-2025 12:06 AM

గాంధీనగర్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, మార్చి 27: (విజయక్రాంతి): డివిజన్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు గురువారం గాంధీనగర్ డివిజన్ లోని దోబి ఘాట్ బస్తీలో గత పదిహేను ఏళ్ళ క్రితం తీసివేసిన మంచినీటి పబ్లిక్ నల్లా కనెక్షన్ ను బస్తి వాసులు విజ్ఞప్తి మేరకు వాటర్ వరక్స్ అధికారులతో చర్చించి తిరిగి నల్లా కనెక్షన్ ను పునరుద్ధరించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకొని బస్తి వాసులకు పబ్లిక్ నల్లా ఏర్పాటు చేయించడం జరిగిందన్నారు. అనంతరం కార్పొరేటర్‌ను మస్తు వాసులు శాలువాతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, ఓబీసీ మోర్చ అసెంబ్లీ కన్వీనర్ ఎం.ఉమేష్, సాయి కుమా ర్, ఆనంద్ రావు, బస్తి వాసులు మల్లికార్జున్, రమేష్, నాగరాజు, పూజిత, శోభ, సురేష్, వరమ్మా, సంజీవ,లక్ష్మి పాల్గొన్నారు.