14 July, 2026 | 6:37 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

కేటీఆర్‌పై ఫిర్యాదు

03-10-2024 01:02 AM

ఎల్బీనగర్, అక్టోబర్ 2: కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ మీడియా, కమ్యూనికే షన్ చైర్మన్ సామ రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అనంతరం రామ్మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మూసీ ప్రక్షా ళనకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.1.50 లక్షల కోట్లు కేటాయించడంలో కుంభకోణం ఉందని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేటీఆర్ ఆరోపణలు మాని ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. మంత్రిగా పనిచేసిన కేటీఆర్‌కు ప్రభుత్వ నిధులు ఎలా కేటాయి స్తారో తెలియదా అని ప్రశ్నించారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా మూసీ ప్రాజెక్ట్ పేరుతో కోట్లాది నిధులు కేటాయించిందని.. వారు కూడా దోచుకోవడానికే నిధులు కేటాయించారా అని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం మూసీ పేరిట చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణ లు చేస్తున్నారని అన్నారు.