06-06-2025 12:05:17 AM
చట్టపరమైన చర్యలు తీసుకుంటాం! సీఐ రవీంద్ర నాయక్
ఎల్లారెడ్డి జూన్ 5 (విజయ క్రాంతి) : ఎరువుల డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఎల్లారెడ్డి సీఐ రవీంద్ర నాయక్, ఎల్లారెడ్డి మండల వ్యవసాయ శాఖ అధికారి నయిముద్దీన్ లు స్పష్టం చేశారు. బుధవారం ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని విత్తన, ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విత్తనాలు, ఎరువులు ,పురుగు మందుల నాణ్యత, విక్రయాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
దుకాణాల యజమానులు కచ్చితంగా ఎరువుల లైసెన్స్ కలిగి ఉండాలని, ఎరువులు పీఓఎస్ మిషన్ ద్వారానే విక్రయించాలని తెలిపారు. డీలర్లు ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖకు రిపోర్టులు అందజేయాలని, స్టాక్ రిజిస్టర్లు రోజు వారీ అప్డేట్ చేయాలని ఆదేశించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయాలని..విక్రయాలలో డీలర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.