03-06-2025 05:37:57 PM
నిర్మల్ (విజయక్రాంతి): టియుసిఏ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజన్న(District Chief Secretary Rajanna) తెలిపారు. మంగళవారం మహాసభల కరపత్రాలను విడుదల చేసి మాట్లాడుతూ... నిజాంబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించి ఈ మహాసభల్లో కార్మిక చట్టాలు ప్రభుత్వ విధానాలపై చర్చించి తీర్మానం చేయడం జరుగుతుందన్నారు. కార్మికులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగన్న గఫూర్ లక్ష్మణ్, భూషణ్ ముత్తన్న తదితరులు ఉన్నారు.