calender_icon.png 20 September, 2025 | 4:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి కోసం ఆందోళన

20-09-2025 02:21:42 PM

కాగజ్ నగర్ (విజయక్రాంతి): సిర్పూర్ నియోజకవర్గంలోని కాగజ్ నగర్ మండలంలోని వంజీరి గ్రామ పంచాయతీ మహిళలు మంచినీటి ఎద్దడి తీర్చాలంటూ ఆందోళన చేపట్టారు. మండలంలోని వంజీరి ఫారెస్ట్ చెక్ పోస్ట్ సమీపములో ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించారు. గత కొన్ని రోజులుగా కుళాయిల ద్వారా నీటి సరఫరా లేక తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మహిళలు ఆరోపించారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో కోట ప్రసాద్ గ్రామస్తులతో మాట్లాడారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ట్యాంకరు ద్వారా నీటి సరఫరా చేస్తున్నప్పటికీ ధర్నా చేయడం సరికాదని, నీల్లు సరిపోకపోతే అదనంగా ట్యాంకర్లు ఏర్పాటు చేస్తామన్నారు. పంచాయతీ పరిధిలోని సిఆర్ నగర్, మహజన్ గూడ గ్రామాల్లో బోరుబావులు లేనందున మంజూరు చేయించవలసినదిగా మహిళలు కోరారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో భరోసా ఇచ్చారు. రూరల్ సీఐ కుమారస్వామికి గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు.  అధికారుల స్పష్టమైన హామీతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. దాదాపు రెండు గంటల పాటు ట్రాఫిక్ అంతరం ఏర్పడింది.